మన్యం జిల్లా తాలాడ గ్రామంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలో పొలాల్లోకి ఏనుగుల మంద దూసుకొచ్చింది.
వరి ధాన్యం కుప్పలతో పాటు కొబ్బరి చెట్లను ఏనుగులు ధ్వంసం చేశాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
గజరాజులు ఇళ్లల్లోకి వచ్చి దాడి చేస్తాయోమనని భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.







