శిక్షణా తరగతులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూరం

హైదరాబాద్ లోని బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్ లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారు.సీనియర్ నేత జగ్గారెడ్డి, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహా, మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ తో పాటు శ్రీధర్ బాబులు ఈ తరగతులకు గైర్హాజరైయ్యారు.

 Telangana Congress Leaders Away From Training Classes-TeluguStop.com

అటు ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉండగా, కర్ణాటక పార్టీ వ్యవహారాల్లో శ్రీధర్ బాబు నిమగ్నమై ఉన్నారు.ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ, ఏఐసీసీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

మరోవైపు టీపీసీసీ శిక్షణా తరగతులను పార్టీ జెండా ఆవిష్కరించి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ తరగతులలో ధరణి, హత్ సే హత్ జోడోతో పాటు ఎన్నికల నిబంధనలపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube