2020లో సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 14 జూన్ హీరో సుశాంత్ సింగ్ మరణించడం అందరికీ షాక్ ఇచ్చినట్లయింది.సుశాంత్ సూసైడ్ చేసుకోవటం దేశవ్యాప్తంగా అందరూ షాక్ కి గురయ్యారు.
దేశ ప్రధాని మోడీ. సుశాంత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్న సమయంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవటం ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది.అయితే ఈ సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసులో డ్రగ్స్ కోణం బయటపడటం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు హత్యా అని.పోస్టుమార్టం సిబ్బంది ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.
మేటర్ లోకి వెళ్తే హీరో సుశాంత్ సింగ్ డెడ్ బాడీకి కూపర్ హాస్పిటల్ లో పోస్టుమార్టం జరిగింది.అయితే ఈ హాస్పిటల్ లో పోస్టుమార్టం సిబ్బందిలో ఒకరు రూప కుమార్… సుశాంత్ బాడీకి పోస్టుమార్టం చేయడం జరిగింది.
అయితే రూప కుమార్ సుశాంత్ ది.ఆత్మహత్య కాదు.హత్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు.అతని డెడ్ బాడీ చూసినప్పుడు ఒంటిపై ఇంకా మెడ పైన గాయాలు ఉన్నాయి.ఇదే విషయాన్ని పై అధికారులకు తెలియజేయడం జరిగింది.

అయితే మా పై అధికారులు డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించే సమయంలో వీడియోలు వద్దు.ఫోటోలు తీస్తే సరిపోతుంది.ఉదయం కల్లా పోస్టుమార్టం పూర్తి కావాలి.
పోలీసులకి డెడ్ బాడీ అప్పగించాలి.అని ఒత్తిడి తేవడం జరిగింది.
ఆ రకంగానే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది.కచ్చితంగా సుశాంత్ మరణం.
హత్య అని రూప కుమార్ స్పష్టం చేశారు.అతడి బాడీపై చాలా గాయాలు ఉన్నాయి.
మెడ మీద కూడా ఉన్నాయి.డెడ్ బాడీని చూస్తే ఈజీగా చెప్పొచ్చు.
ఇది దాడి వలన జరిగిందని.అని రూప కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.







