సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి తండ్రి కృష్ణ, ఇందిరా దేవి మరణాలతో విషాదం లోకి వెళ్ళిపోయాడు.కొద్దీ రోజుల సమయం తేడాతోనే వీరిద్దరూ మరణించడం వల్ల ఈయన వెంటనే కోలుకోలేక పోయాడు.
ఇక ఇప్పుడిప్పుడే వీరి మరణం నుండి కోలుకుని మెల్లగా మునుపటిగా మారుతున్నాడు.దీంతో ఫ్యాన్స్ కూడా మహేష్ కోలుకోవడంతో కొద్దిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా మహేష్ పిక్ ఒకటి బయటకు వచ్చింది.ఈయన సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ స్టోరీ పెట్టగ ఆ పిక్ వైరల్ అయ్యింది.మహేష్ తన ఫిజికల్ థెరపిస్ట్ డాక్టర్ మినాష్ గాబ్రియేల్ తో కలిసి కనిపించాడు.ఈ పిక్ లో మహేష్ చాలా అందంగా కనిపిస్తున్నాడు.
వాటర్ బోటిల్ పట్టుకుని స్టైలిష్ పోజ్ లో కనిపిస్తున్నాడు.ఎప్పటి లాగానే తన అందంతో అందరిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు.
తన వయసుతో సంబంధం లేకుండా ఈయన అందం రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.47 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్ తో యువతను మాయ చేస్తున్నాడు.ఇదిలా ఉండగా మహేష్ సినిమాల విషయానికి వస్తే.మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.అయితే మహేష్ ఫ్యామిలీ కారణాల వల్ల ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.