విశాఖ డ్రమ్లో మృతదేహం మిస్టరీ వీడింది.డ్రమ్ లో ఉన్న మృతదేహం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళదిగా పోలీసులు గుర్తించారు.
అయితే ఆ ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే సుమారు ఏడాదిన్నర కాలంగా ఇంటికి తాళం వేసి ఉంది.
ఈ క్రమంలోనే ఇంటిని శుభ్రం చేయించేందుకు యజమాని తాళం తీయగా డ్రమ్ములో మృతదేహాన్ని గుర్తించారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సాయంత్రం వెల్లడించనున్నట్లు ప్రకటించారు.