CM Jagan Chandrababu : నేడు ఢిల్లీకి.. సీఎం జగన్, చంద్రబాబు  ..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.జీ20 సదస్సుకు నాయకత్వ బాధ్యతలు ఇటీవల భారత్ కి దక్కిన నేపథ్యంలో ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.ఈ సమావేశానికి వైసీపీ నుంచి జగన్, టీడీపీ నుండి చంద్రబాబు హాజరుకానున్నారు.ఈ క్రమంలో ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటల 15 నిమిషాలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.

 Cm Jagan, Chandrababu To Delhi Today Ap Cm Ys Jagan, Chandrababu, Delhi, Bjp, Mo-TeluguStop.com

ఇక ఇదే సమయంలో ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందుగానే శంషాబాద్ విమానాశ్రయానికి కొద్దిగా గంటల క్రితం చేరుకొని ఢిల్లీకి బయలుదేరారు.సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీ నుంచి తాడేపల్లికి జగన్ పయనం కానున్నారు.

ఆ తర్వాత రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప అమీన్ పీర్ దర్గాలో పెద్ద ఉర్సు ఉత్సవాల్లో ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube