Keerthy Suresh : ఇదొక అద్భుతమైన అనుభవం.. మనసుకు ప్రశాంతంగా ఉంది.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్!

తెలుగు తమిళ భాషలలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ గురించి అందరికీ సుపరిచితమే.

ప్రస్తుతం వరుస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇకపోతే తాజాగా కీర్తి సురేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన పూర్వీకుల సొంత గ్రామానికి వెళ్ళినట్టు తెలుస్తుంది.

కీర్తి సురేష్ తండ్రి సురేష్ మలయాళీ వ్యక్తి కాగా ఆమె తల్లి నటి మేనక తమిళ అమ్మాయి.ఈమె ఇప్పటికీ తిరునెల్వేలి జిల్లా తిరుక్కట్రంకుడి గ్రామంలో నివసిస్తున్నారు.

 దీంతో కీర్తి సురేష్ తన సొంత గ్రామానికి వెళ్లి అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడి చేశారు.ఇలా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపిన కీర్తి సురేష్ ఆ ప్రాంతంలో ఎనిమిదవ దశాబ్దంలో నిర్మించిన నంబిపెరుమాళ్‌ ప్రాచీన దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

Advertisement

ఈ విధంగా ప్రాచీన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయ ప్రాంగణాన్ని సందర్శించి అక్కడ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.8వ దశాబ్దంలో నిర్మించిన ఆలయాన్ని సందర్శించడం అద్భుతమైన అనుభవం.ఈ ఆలయ శిల్పకళను చూసి ఎంతో తన్మయం చెందానని తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని ఈ సందర్భంగా కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు