యాదాద్రి జిల్లా:నీ కాళ్లు మొక్కుత సారూ పైసలిప్పియ్యరూ అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో జరిగింది.బస్వాపురం గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరయ్యారు.
ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుడు ఉడుత అంజయ్య అనే వృద్ధుడు అక్కడికి వచ్చాడు.రిజర్వాయర్ నిర్మాణంతో తన వ్యవసాయ భూమి, బోరు పోయిందని పైసలు ఇప్పించాలని ఎమ్మెల్యే కాళ్లపై పడి దండం పెట్టి వేడుకోవడం అందరినీ కలచివేస్తుంది.







