ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ ఊహాలోకాల్లో విహరిస్తున్నారన్న ఆయన.

 Flies In The House. Pallaki Outside: Kishan Reddy's Sensational Comments-TeluguStop.com

వెళ్లిన ప్రతీ చోటా కేసీఆర్ అవమానాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.కేసీఆర్ తీరు ఇంట్లో ఈగల మోత.బయట పల్లకీ మోత అన్న చందాన ఉందని ఎద్దేవా చేశారు.ఎవరూ కూడా కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలను అంగీకరించడం లేదని విమర్శించారు.

రాష్ట్రానికి కేంద్రం ఏం చేయడం లేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సకాలంలో ఇవ్వకపోగా.సర్పంచ్ లను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube