ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో బీజేపీ స్టింగ్ ఆపరేషన్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ లిక్కర్ స్కాం ఏంటో అర్ధం కావడం లేదన్నారు.
కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తుంది.ఈ క్రమంలో ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలి కదా అని ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిలో నిర్వహించిన సోదాల్లో ఏం దొరకలేదని పేర్కొన్నారు.కేంద్రానికి సీబీఐ, ఈడీపై ఉన్న ధ్యాస పాజిటివ్ పనులపై లేదని కేజ్రీవాల్ విమర్శించారు.24 గంటలూ సీబీఐ ఈడీ దాడులతో అందరినీ భయపెట్టిస్తున్నారని ఆరోపించారు.అయితే, లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.







