తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి ఈ ఆవర్తనం ఏర్పడనుంది.ఈ మేరకు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడనుంది.
అదేవిధంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.







