రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి పట్ల టాలీవుడ్ సినిమా పరిశ్రమ కు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు.పలువురు కృష్ణం రాజు పార్థివ దేహాన్ని దర్శించుకొని తుది నివాళ్లు అర్పించారు.
కృష్ణం రాజు కి నివాళులు అర్పించిన వారి లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజు ఇంకా పలువురు నటీనటులు మరియు దర్శక నిర్మాతలు ఉన్నారు.కృష్ణం రాజు పార్ధీవ దేహం వద్ద ప్రభాస్ ఉండ గా కృష్ణం రాజు కు నివాళులర్పించిన ప్రముఖులు ప్రభాస్ తో ముచ్చటించి తమ సానుభూతి ని తెలియ జేశారు.
ఈ సందర్భం గా పలువురు ప్రముఖు లు కృష్ణం రాజు తో తమకున్న అనుబంధాన్ని అక్కడే మీడియా తో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మా ఊరి హీరో అంటూ ఎమోషనల్ అయ్యారు.
చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్ ఇంకా మహేష్ బాబు ఇతర ఇండస్ట్రీ ప్రముఖులు అంతా కూడా కృష్ణం రాజు లేని లోటు ఏ ఒక్కరు తీర్చలేనిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇండస్ట్రీ లో ఎంతో మంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా కృష్ణం రాజు కి నివాళులు అర్పించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా కూడా కృష్ణం రాజు యొక్క మృతి కి సంబంధించిన వార్తలు మరియు ప్రముఖులు నివాళులర్పించిన వార్తలు కనిపిస్తున్నాయి.సినిమా పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తి ని కోల్పోయింది అంటూ అభిమాను లు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు దుఃఖం లో మిగిలి పోయారు.
ప్రభాస్ ని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.ప్రభాస్ మరియు కృష్ణం రాజు కలిసి చివరగా రాధేశ్యామ్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.
గురు శిష్యులుగా వీరిద్దరు రాధేశ్యామ్ సినిమాలో నటించారు.