రేపు సీఎం జగన్ అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు.దీనిలో భాగంగా ఏపీ సెజ్ లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్, ఉత్పత్తులను ఆయన ప్రారంభించనున్నారు.
మరికొన్ని పరిశ్రమల భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విశాఖ జిల్లా మర్రిపాలెం ఎమ్మెల్యే వాసుపల్లి నివాసానికి వెళ్లనున్నారు.
పర్యటన సందర్భంగా ముందుగా రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్.ఉదయం 10.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.అక్కడి నుండి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకోంటారు.అక్కడ ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ను ప్రారంభిస్తారు.అనంతరం మరికొన్ని పరిశ్రమల భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 12.40 గంటలకు అచ్యుతాపురం నుంచి విశాఖకు బయలుదేరనున్నారు.మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి చేరుకుని.
ఇటీవల వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు జగన్.అనంతరం తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.