దర్శకుడు తేజ కెమెరా అసిస్టెంట్ గా క్లాప్ భాయ్ గా పనిచేస్తున్న రోజులవి.తేజ ఇండస్ట్రీకి ఎంతో కష్టపడి వచ్చారు.
తొలినాల్లలో క్లాప్ కొడుతూ ఉండేవారు.ఆ తర్వాత ఆయన దర్శకుడుగా ఎదిగి ఎన్నో సంచలమైన సినిమాలు తీశారు.
కానీ ఆయన అసిస్టెంట్ గా పని చేసిన రోజుల్లో జరిగిన ఒక సంఘటనని ప్రేక్షకులతో పంచుకున్నారు.సినిమా ఇండస్ట్రీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
ఒక సినిమా తీస్తున్నామంటే ఎన్నో విషయాలు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.కెమెరా నుంచి లైట్ వరకు ప్రతి ఒక్కటి కూడా సరిగ్గా పనిచేస్తేనే అవుట్ ఫుట్ బాగా వస్తుంది.
అలా నమ్మే వ్యక్తుల్లో శ్రీదేవి, అమితాబచ్చన్ లాంటి దిగ్గజాలు ఉన్నారు.
క్షణం క్షణం సినిమా జరుగుతున్న సమయంలో జరిగిన ఒక సంఘటన దర్శకుడు తేజ ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు గోపాల్ రెడ్డి అలాగే నిర్మాతగా కూడా ఆయనే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా ఆ సమయంలో తేజ గోపాల్ రెడ్డికి అసిస్టెంట్ గా పనిచేసేవారు.
ఓవైపు క్లాప్ కొడుతూనే మరోవైపు కేమేరాలను కూడా ఆపరేట్ చేసేవారు.క్షణం క్షణం షూటింగ్ లోకేషన్ కి వచ్చిన శ్రీదేవి అద్దంలో తనని తాను చూసుకుంటూ తన వెనకాల పడిన ఒక లైట్ గురించి గోపాల్ రెడ్డిని పిలిచి ఆ లైట్ సరిగ్గా లేదు ఒకసారి చూడండి అని చెప్పారట.
దాంతో గోపాల్ రెడ్డి తేజ ని పిలిచి బాగా కొప్పడ్డారట.దాంతో తేజకి చిర్రేత్తుకొచ్చింది.వచ్చిన పని చూసుకోక ఈవిడకి లైట్ తో సంబంధం ఏంటి అంటూ పక్కకెళ్ళి గొనుగుక్కున్నారట.
కానీ ఆయన దర్శకత్వం వహిస్తున్న సమయంలో అప్పుడు తెలిసి వచ్చిందట ఒక లైట్ సరిగ్గా పడకపోతే దాని వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది అని.అంత ఖచ్చితత్వం శ్రీదేవికి ఉండటం నిజంగా గొప్ప అంటారు ఇప్పుడు తేజ.అమితాబచ్చన్ గురించి చెబుతూ ఆయన ఒక సినిమా సన్నివేశం జరుగుతున్న సమయంలో మరొక నటుడికి ఒక సీన్ ఉందట.ఆ సీన్ లో జరుగుతున్న దృశ్యాన్ని ఆయన క్యారవాన్ లో కూర్చోకుండా బయటకు వచ్చి మరి బాగా నటిస్తున్నాడు అంటూ అక్కడే కూర్చున్నాడట.అంటే ఒక సీన్ సంబంధం ఆయనకు లేకపోయినా కూడా ఇంత గొప్ప స్టార్ అయినప్పటికీ కూడా సినిమా లేదా పాత్ర పండాలంటే అందరి కాంబినేషన్స్ కూడా సరిగా ఉండాలి అని భావించే నటుల్లో అమితాబచ్చన్ ఒకరు అని తేజ గొప్పగా చెప్పారు.