యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఈ హీరోకు బ్యాచిలర్ కాస్త విముక్తి ఇచ్చింది అనే చెప్పాలి.
ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు.బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.
ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన కానీ గత ఏడాది నుండి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దీంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి.
అందుకే ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ చేస్తామని చెప్పినా కూడా ఆ సూచనలు అయితే లేవు.ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత అఖిల్ మరో సినిమా లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ తర్వాత సినిమ చేయబోతున్నాడు అని రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ డైరెక్టర్ అఖిల్ లో ఒక రొమాంటిక్ లవ్ డ్రామా సినిమాను ప్లాన్ చేసినట్టు టాక్.

ఇక తాజాగా ఈ సినిమాపై మరొక గాసిప్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయక ముందే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాకు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ను అనుకుంటున్నాడట.అఖిల్ వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు ‘తమ్ముడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడట.మరి పవన్ టైటిల్ తో ఈ యంగ్ హీరో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.






