బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ పూజా మిశ్ర గురించి మనందరికి తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా విపరితమైన పాపులరిటీని సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా మిశ్ర శత్రుఘ్న సిన్హా పై అతని కుటుంబం పై సంచలన ఆరోపణలు చేసింది.తనపై చేతబడి చేసి అనంతరం తాను సృహ లేని సమయంలో తన కన్యత్వాన్ని వ్యాపారంగా చేసారు అని చెప్పుకొచ్చింది.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ 17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ కుటుంబం తనని వేదిస్తూనే ఉందని తెలిపింది.ఆమె తండ్రి అతనికి కోట్లాది రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే అతను మాత్రం ఆమె కెరీర్ను నాశనం చేశాట.
అలాగే నేను ఇక్కడ పాపులర్ అవుతానో అని భయపడ్డాడు అని చెప్పుకొచ్చింది పూజా.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒకరోజు పూజా శత్రుఘ్న సిన్హాకు బర్త్ డే విషెస్ చెబ్దమని వెళ్లగా అప్పుడు శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్, పూజాకి చేతబడి చేసిన పదార్థాన్ని తినిపించిందట.ఆ పదార్థం తిన్న తర్వాత ఆమె శరీరం ఆమె కంట్రోల్లో లేని సమయంలో సెక్స్ స్కామ్ లో పాల్గొనేల చేయడంతో పాటు ఆమె కన్యత్వాన్ని అమ్మిన ఫ్యాషన్ డిజైనర్ కావాలి అనుకున్న అతని కూతురు సోనాక్షి సిన్హా ను స్టార్ ను చేసాడు అని చెప్పుకొచ్చింది.2007 నుంచి 2014 వరకు నేను లోఖండ్వాలాలోని ఫ్యామిలీ అపార్ట్మెంట్లోనే నివసించానని,అప్పడు అతని కుటుంబం ఆమె పై పోర్షన్లో ఉండేవారని,ఆమె సింగపూర్ లో షాపింగ్కు వెళ్లి తిరిగొచ్చే సమయానికి గదిలో ఆమె వస్తువులు కనిపించకుండా చేసి వాటిని ఫొటోషూట్లలో వాడుకోమని సోనాక్షి సిన్హాకు అప్పగించేవారు అని చెప్పుకొచ్చింది పూజా.

అలాగే కేవలం అతడి వల్లే ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదని, ఆమెకి డ్రగ్స్ ఇచ్చి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేవాడు.నా కెరీర్ నాశనమైందంటే అది కేవలం శత్రుఘ్న సిన్హా వల్లే అని తెలిపింది పూజా శర్మ.ఈ ఆరోపణలపై శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హ స్పందించాడు.ఆమెకు వృత్తిపరంగా సహాయం కావాలనుకుంటా.నా కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నప్పుడే ఆమె మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతోంది.సాధారణంగా ఇలాంటి చెత్త కథనాలపై స్పందించి సమయం వృథా చేసుకోను.
కానీ నిజానిజాలు తెలుసుకోకుండా మా కుటుంబ గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి కథనాలు రాసేవాళ్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను ట్వీట్ చేశాడు.







