మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఒక వైపు ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా మరొక మూడు రోజుల్లోనే రిలీజ్ కానుంది.ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం.
ప్రెసెంట్ ఈ టీమ్ అంతా జోరుగా ప్రొమోషన్స్ చేస్తూ క్షణం కూడా వేస్ట్ చేయకుండా గడిపేస్తున్నారు.
ఇక మరొక వైపు అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రకటించడమే కాకుండా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ ప్రొమోషన్స్ కోసం షూటింగ్ గ్యాప్ ఇచ్చిన టీమ్ త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా RC15‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాను దిల్ రాజు 170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని సమాచారం.
తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాలో శంకర్ చరణ్ కోసం స్టైలిష్ విలన్ ను రంగంలోకి దించాడని.వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం విలన్ గా అరవింద స్వామి ను సంప్రదించారని ఆయన ఓకే చెప్పాడని టాక్.ఈయన త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడట.
ఇప్పటికే చరణ్ ధ్రువ సినిమాలో అరవింద స్వామి విలన్ గా నటించాడు.ఈ సినిమాలో ఈయన స్టైలిష్ విలన్ గా ఆడియెన్స్ మనసు దోచేశాడు.ఇక ఇప్పుడు మరోసారి స్టైలిష్ విలన్ ను శంకర్ చరణ్ కోసం తీసుకు రావడంతో ఈ సినిమాపై ఇప్పుడు మరింతహైప్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.