రష్మీని పార్కుకు తీసుకెళ్లిన సుధీర్.. రొమాంటిక్ గా కామెంట్లు చేస్తూ?

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న రష్మీ సుధీర్ జోడీ అదే క్రేజ్ ను గత తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు.

తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా ఆ ప్రోమోలో సుధీర్ రష్మీ జోడీ రచ్చరచ్చ చేశారు.

ప్రోమోలో సుధీర్ రష్మీని పార్కుకు తీసుకెళ్లడంతో పాటు పార్కులో ఆర్య సినిమాలోని ఫీల్ మై లవ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎంట్రీ ఇచ్చారు.సుధీర్ దగ్గర బుడగలు ఉండగా ఆది బుడగలు ఎంత అని అడుగుతూ సుధీర్ పరువు తీస్తారు.

ఆ తరువాత సుధీర్ రష్మీని సైకిల్ పై ఎక్కించుకోగా ఇద్దరూ దగ్గరగా కూర్చుంటారు.ఆ తర్వాత పార్కుకు తీసుకొచ్చానని తొమ్మిది నలభై ఐదు అవుతోందని ఏంటి మరీ అంటూ సుధీర్ అడగగా రష్మీ కూడా రొమాంటిక్ గా ఏంటి మరీ అంటూ కామెంట్లు చేస్తుంది.

ఆ తరువాత ఫహీమా ఎంట్రీ ఇవ్వగా ఫహీమాలా చేసి చూపించాలని ప్రదీప్ రష్మీ, దీపికలను అడగగా వాళ్లు మాత్రం ఫహీమాలా ఎక్స్ ప్రెషన్లు ఇవ్వలేకపోతారు.

Advertisement

ఆ తర్వాత అలా చూడు ప్రేమలోకం పాటతో హైపర్ ఆది ఎంట్రీ ఇస్తారు.ఆ తర్వాత హైపర్ ఆది దీపికా పిల్లితో ప్రేమగా నీతో ఒక డైలాగ్ చెప్పాలని అనుకుంటున్నానని చెప్పగా దీపికా పిల్లి చెప్పమని అడుగుతుంది.నేను సైకిల్ ఎక్కితే నువ్వు తొక్కుతావో లేదో తెలియదు కానీ నువ్వు సైకిల్ ఎక్కితే మాత్రం నేను తొక్కుతానంటూ ఆది చెబుతాడు.

ఆ తర్వాత వన్ ఇయర్ అయింది ఏంటి మరీ అని హైపర్ ఆది దీపికా పిల్లిని అడుగుతాడు.రష్మీ వెంటనే ఇక్కడ తొమ్మిది సంవత్సరాలకే ఏమీ లేదని చెప్పగా తొమ్మిదికి కాదు పంతొమ్మిదికి అయినా ఏమీ అవ్వదని హైపర్ ఆది చెబుతాడు.2021 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Advertisement

తాజా వార్తలు