గతేడాది నుంచి సినీ, బుల్లితెర నటీనటులు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.ఇటీవలే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోగా సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.
అంతే కాకుండా మరో మరాఠీ నటి ఇటీవలే వివాహం చేసుకోగా.తనకంటే ఎనిమిదేళ్ల చిన్న వయసున్న వాడిని పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.నటి మానసి నాయక్ మరాఠి లో కొన్ని సినిమాలు చేసింది.అంతేకాకుండా బుల్లితెరలో కూడా కొన్ని సీరియల్ లో నటించింది.బాగ్తోయి రిక్షావాలా అనే డాన్స్ నంబర్ తో మానసి మంచి గుర్తింపును దక్కించుకుంది.మానసి గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ ఖరేరా అనే బాక్సర్ తో ప్రేమలో ఉంది.
ఇటీవల సోషల్ మీడియాలో తాము పెళ్లి చేసుకోబోతున్నమంటూ ఈ జంట తెలిపింది.ప్రదీప్ ప్రొఫెషనల్ బాక్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాగా ఇతని వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే.

ఇటీవలే మంగళవారం రోజు పూణేలో తమ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగింది.గులాబీ రంగు లెహంగాలో మానసి, బంగారు వర్ణపు షేర్వానీ తో ప్రదీప్ చూడముచ్చటగా కనిపించారు.ప్రస్తుతం వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.పెళ్లి తర్వాత మానసి మాట్లాడుతూ.” నేను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిగింది నాకు ఆనందంగా ఉందని, ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనంటూ తెలిపింది.ప్రదీప్ కుటుంబ సభ్యులు కూడా నన్ను మంచిగా చూసుకుంటున్నారని” తెలిపింది.ఇదిలా ఉంటే ప్రదీప్,మానసి ల మధ్య వయసులో చాలా తేడా ఉండగా.దాదాపు వీరిద్దరి మధ్య ఎనిమిదేళ్ల ఉన్నాయి.ప్రదీప్ మానసి కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు అని తేలింది.







