పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
బిజీ రాజకీయ షెడ్యూల్ కారణంగా పవన్ రీఎంట్రీ సినిమా ఆలస్యమవుతుందని పవన్ సన్నిహితులు తెలిపినా, తమ ఫెవరేట్ హీరో సినిమాను వీలైనంత త్వరగా చూడాలని కోరుతున్నారు పవన్ ఫ్యాన్స్.
కాగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనుండగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తరువాత తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కోసం క్రిష్ డైరెక్షన్లో పవన్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా పవన్ నటించబోయే దర్శకుల జాబితాలో ఓ కొత్తపేరు వచ్చి చేరింది.
క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి.గతంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే సినిమా వీరి కాంబినేషన్లో వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడున్న రాజకీయాలను ప్రతిబింబించే కథను పూరీ రెడీ చేసినట్లు, అది పవన్ కోసమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరితే మాత్రం బాక్సాఫీస్ను పవన్ కళ్యాణ్ కుమ్మడం ఖాయమని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.ప్రస్తుతం ఈ కాంబినేషన్కు సంబంధించిన వార్త మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు కుదురుతుందో చూడాలి అంటున్నారు పవన్ ఫ్యాన్స్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy