`రంగస్థలం` సినిమా రెండో వారంలో కూడా తన సత్తా చాటుతోంది.తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది.
కాగా, ఈ సినిమాలోని రామ్చరణ్, సమంత మధ్య చిత్రీకరించిన ముద్దు సీన్ గురించి దర్శకుడు సుకుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.సాధారణంగా ముద్దు సీన్లంటే హీరోయిన్లు డబ్బులు అదనంగా డిమాండ్ చేస్తుంటారు.
`రంగస్థలం` సినిమాలో మాత్రం ముద్దు సీన్ వల్ల సుకుమార్కు అదనంగా డబ్బులు కలిసొచ్చాయట.ఆ ముద్దు సీన్ తీసినందుకు సుకుమార్కు నిర్మాత పది లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా ఇచ్చారట.
ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ వెల్లడించాడు.`సినిమాలో చాలా క్లిష్టమైన సీన్ అది.హీరోహీరోయిన్లు తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తపరుచుకోవాలి.అదే టైమ్లో పోలీసులు వచ్చి చెర్రీని తీసుకుపోవాలి.
ఆ సీన్ గురించి రెండ్రోజులు ఆలోచించా.ఆ ముద్దు సీన్ ఎలా తీయాలా అని తెగ ఆలోచించా.
`ఆ ముద్దు సీన్ తీయడం నీ వల్ల కాదు.ఒకవేళ తీస్తే నీకు పదిలక్షలు ఎక్స్ట్రాగా ఇస్తాన`ని నిర్మాత చాలెంజ్ చేశారు.
దాంతో ఆ సీన్ను చాలెంజ్గా తీసుకుని కేవలం 30 నిమిషాల్లో ఆ ముద్దు సీన్ను తీశా.ఆ ముద్దు సీన్ గురించి సమంతకు మాత్రమే చెప్పా.
చెర్రీకి ముందుగా చెప్పలేదు.దీంతో ఆ సీన్లో చెర్రీ చాలా సహజంగా నటించాడ`ని సుకుమార్ చెప్పాడు.
.