పబ్ జి ఆడుతూ తినడం మానేశాడు.. ప్రాణాలు పోయాయి!

పబ్ జి.ఈ కాలం పిల్లలకు ఈ ఆటలు ఉంటే చాలు అన్ని మర్చిపోతారు.

ఆటలో పడితే మనుషులను మర్చిపోయి క్రూరంగా తయారవుతున్నారు.కొందరు పబ్ జి గేమ్ కోసం చంపేస్తుంటే మరికొందరు చచ్చిపోతున్నారు.

మరి కొందరు అయితే పబ్ జి గేమ్ కోసం డబ్బులు తల్లితండ్రులు ఎంత కష్టపడి సంపాదించినా తగిలేస్తున్నారు.ఇంకా ఇప్పుడు కూడా అలానే ఓ యువకుడు చచ్చిపోయాడు.

వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నప్పటికి ఓ యువకుడు పబ్ జి ఆడుతూ తినడం మర్చిపోయాడు.చివరికి ప్రాణాలు పోయాయి.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పశ్చిమ గోదావరి జిల్లాలోని జాజులకుంట గ్రామంకు చెందిన 16 ఏళ్ల బాలుడు పబ్ జి కి బానిసయ్యాడు.

దీంతో రోజులు తరబడి ఆటలోనే మునిగిపోయాడు.ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేశాడు.

ఆఖరికి మంచినీళ్లు కూడా తాగడం మానేశాడు.దీంతో కొన్ని రోజులకు అనారోగ్యానికి గురయ్యాడు.

వైద్యులు పరీక్షించి ప్రమాదకరమైన డీహైడ్రేషన్‌కు గురయ్యాడని, డయేరియా బారిన పడ్డట్టు తెలిపారు.దీంతో అక్కడే చికిత్స్ పొందుతున్న ఆ బాలుడు మృత్యువాత పడ్డాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

చేతికి అందిన కొడుకు మృతి చుసిన తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు