పంచలింగాలు అంటే ఏమిటి.. వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడిని భక్తులు పెద్ద ఎత్తున పూజిస్తారు.సాధారణంగా మనకు శివుడు విగ్రహరూపంలో కాకుండా లింగ రూపంలో దర్శనమిస్తాడు.

ఈ విధంగా లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని భావిస్తారు.ఈ విధమైనటువంటి లింగాలలో పంచలింగాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.మరి పంచలింగాల అని వేటిని అంటారు వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

1.పృథ్విలింగం:

పంచలింగాలలో ఒకటైన పృథ్విలింగం కంచిలో ఉంది.ఈ క్షేత్రంలో వెలిసిన లింగాన్ని స్వయంగా పార్వతీ దేవి చేత ప్రతిష్టించబడినది కావడంవల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని ఏకాంబరేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు.అదే విధంగా ఇక్కడ వెలసిన అమ్మవారు కామాక్షి దేవి అమ్మవారు.

2.ఆకాశలింగం:

What Is The Significance Of Five Panchabhutalu Pancha Lingas, Panchabutha Lingal

ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో ఉన్నది.ఈ ఆలయంలోని వెలసిన స్వామి వారి దర్శనం ఎంతో రహస్యం.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారి విగ్రహానికి దర్శనం ఉండదు.ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3.జల లింగం:

What Is The Significance Of Five Panchabhutalu Pancha Lingas, Panchabutha Lingal

పంచలింగాలలో జలలింగం ఒకటి.తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో వెలసిన స్వామి వారి లింగం కింద ఎప్పుడు నీరు ఉండటం వల్ల ఈ ఆలయంలో వెలసిన లింగానికి జలలింగం అనే పేరు వచ్చింది.అదేవిధంగా స్వామి వారిని జంబుకేశ్వరుడుగా పూజిస్తారు.

4.తేజోలింగం:

What Is The Significance Of Five Panchabhutalu Pancha Lingas, Panchabutha Lingal
Advertisement

అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు.అందుకే ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని అరుణాచలేశ్వరుడుగా, ఇక్కడ వెలసిన అమ్మవారిని అరుణాచలేశ్వరిగా భక్తులు పూజిస్తారు.

5.వాయు లింగం:

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తీశ్వరలో వెలసిన స్వామివారిని వాయు లింగం అంటారు.ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని శ్రీకాళహస్తీశ్వరుడు అని పూజిస్తారు.ఈ విధంగా పంచభూతలింగాలుగా ఎంతో ప్రసిద్ధి చెందాయి.

Advertisement

తాజా వార్తలు