సూచనా చౌదరి అరెస్ట్ కాబోతున్నాడా ..? బాబు సైలెంట్ అందుకేనా ..?

కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీ .

మాజీ మంత్రి సుజనా చౌదరి ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించి ఆయన అనేక ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు కేసులు నమోదు చేసుకుని సమన్లు కూడా పంపారు.

అయితే ఈ విషయం పై ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు.కానీ ఈ వ్యవహారంలో ఆయనకు ఊరట లభించలేదు.

దీంతో ఆయన వరసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యాడు.దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సుజనాకు చెందిన కంపెనీలు అప్పుగా తీసుకున్నాయి.

వ్యాపారంలో నష్టాలని ఆ సొమ్ములను ఎగవేశారు.ఆ కంపెనీలే డొల్ల కంపెనీలు అని లోన్ల కోసమే వాటిని పుట్టించినట్టుగా ఈడీ నిర్ధారించింది.

Advertisement

అయితే సుజనా చౌదరి వ్యవహారంలో ముందు టీడీపీ .ఆ పార్టీ అనుకూల మీడియా గట్టిగా స్పందించింది.అయితే ఈ వ్యవహారం రోజు రోజుకు బిగిసే ఛాన్స్ కనిపించడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

చౌదరిని ఈడీ అరెస్టు చేయవచ్చని చంద్రబాబు కు కూడా తెలిసిందని.అందుకే బాబు ఇప్పుడు కామ్ గా ఉన్నాడని, చౌదరి గురించి మాట్లాడితే ఆ వ్యవహారం తమకు చుట్టుకుంటుందని తెలుగుదేశం నేతలు కూడా మౌనం వహిస్తున్నారని పార్టీలోనే గుజగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు