Kishan Reddy : తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తాం..: కిషన్ రెడ్డి

తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప సలహా బాక్సులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.ఈ నెల 15 వరకు బీజేపీ సలహాలు తీసుకోనుందన్న ఆయన సలహాల కోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర( Vijaya Sankalpa Yatra )తో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని చెప్పారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ( Parliament elections )370 కి పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తామని ఆయన వెల్లడించారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు