భారతదేశంలో పెట్రోల్ బంకులు( Petrol Pumps ) ప్రజా జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఆవశ్యక కార్యకలాపాల్లో పెట్రోలు, డీజిల్పై ఆధారపడి ఉంటున్నారు.
అందువల్ల పెట్రోల్ బంకుల పని సమయాలు, సేవలకు సంబంధించి మార్పులు ఎప్పుడూ పెద్ద చర్చనీయాంశమవుతాయి.
తాజాగా సోషల్ మీడియా వేదికలపై ఒక సంచలన వీడియో వైరల్ అవుతోంది.ఆ వీడియో ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయబడతాయని ప్రచారం జరుగుతోంది.ఇందులో పర్యావరణ పరిరక్షణ చర్యలలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొనబడింది.
కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తను వాస్తవ నిర్ధారణ లేకుండానే ప్రచారం చేయడం గమనార్హం.
అయితే, ఈ వైరల్ అవుతున్న వీడియో నిజానికి 2017 నాటిది.2017లో ప్రధాని నరేంద్ర మోదీ "మన్కీ బాత్"( Manki Baat ) కార్యక్రమంలో చమురు వనరుల సంరక్షణపై పిలుపునిచ్చారు.ఈ సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల యజమానుల సంఘాలు ప్రతి ఆదివారం సెలవు పాటించే ప్రతిపాదన చేయాలని భావించాయి.
కానీ, అప్పుడు కూడా ఈ ప్రతిపాదన పూర్తిగా అమలవలేదు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ బంకులు ప్రతి ఆదివారం మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ఎక్కడా అధికారిక ప్రకటన లేదు.
కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ బంకులు సాధారణంగానే పని చేస్తున్నాయి.వైరల్ అవుతున్న ఈ వీడియో పాతదని, దయచేసి ఎవరైనా చూసినా గమనించి వాస్తవాలు తెలుసుకొని ఇతరులతో పంచుకోండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy