జిన్‌జియాంగ్‌లో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న చైనా.. ఖండించిన యూఎస్

డ్రాగన్ కంట్రీ చైనా( China ) దేశ ప్రజలతో పాటు ఇరుగుపొరుగు దేశాల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోంది.

అప్పుడప్పుడు ఇండియా జోలికి కూడా వస్తూ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

ఈ రోజుల్లో చైనా జిన్‌జియాంగ్, టిబెట్, హాంకాంగ్‌లలోని( Xinjiang, Tibet, Hong Kong ) ప్రజల మానవ హక్కులను కాల రాస్తోంది.అయితే ఆ ప్రజల హ్యూమన్ రైట్స్‌ను చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా తీవ్రంగా విమర్శించింది.

ఈ వ్యక్తులను వేధించడం, గూఢచర్యం చేయడం, బెదిరించడం మానేయాలని అమెరికా చైనాను కోరింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో అమెరికా రాయబారి మిచెల్ టేలర్( US Ambassador Michelle Taylor ) ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.అన్యాయంగా నిర్బంధించబడిన వారందరినీ, ముఖ్యంగా UN సమూహం పేరు పెట్టబడిన వారందరినీ విడిపించాలని ఆమె చైనాను కోరారు.సంస్కృతి, భాష, మతం లేదా విశ్వాసం ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపడం చైనా ఆపాలని కూడా విజ్ఞప్తి చేశారు.

Advertisement

టిబెట్, జిన్‌జియాంగ్‌లోని బోర్డింగ్ పాఠశాలలకు పంపించి ప్రజల గుర్తింపును మార్చేలా బలవంతం చేయడాన్ని సైతం చైనా ఆపాలని ఆమె అన్నారు.

చైనా దేశంలోని ప్రజలను హింసించడం, జైలులో పెట్టడం మానేయాలని ఆమె కామెంట్ చేశారు.జిన్‌జియాంగ్‌లో ప్రజలను పని చేయమని, పెళ్లి చేసుకోమని, పిల్లలను కనమని బలవంతం చేయవద్దని కూడా రిక్వెస్ట్ చేశారు.ముఖ్యంగా హాంకాంగ్‌లో ప్రజల భద్రత, స్వేచ్ఛకు ముప్పు కలిగించే కొన్ని చట్టాలను రద్దు చేయాలని టేలర్ చైనాను కోరారు.

ఈ చట్టాలు మహిళలు, ఎల్‌జిబిటిక్యూ వ్యక్తులు, హాంకాంగ్ మరియు మకావులోని వలస కార్మికులను అణచివేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.జిన్‌జియాంగ్‌లో చైనా చేస్తున్న మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను, ఇతర దేశాల్లో నివసించే ప్రజల నోరు మూయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న తీరును అమెరికా ఖండిస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement

తాజా వార్తలు