దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి భారతి

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈవో, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.

అలాగే ఈవో భ్రమరాంబ అమ్మవారి ఫోటో, లడ్డు ప్రసాదం అందజేశారు.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement