ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో టీఎస్ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారం కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ అందించిన నోటీసులపై ఉన్న స్టే ను న్యాయస్థానం పొడిగించింది.

ఈ మేరకు ఈనెల 22వ తేదీ వరకు స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే పలువురికి నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!
Advertisement

తాజా వార్తలు