సాహితి ఫార్మా కంపెనీ గేటు ముందు ఆందోళనకు దిగిన కార్మికులు..!!

ఈరోజు ఉదయం అచ్యుతాపురంలో ఉన్న సాహితీ ఫార్మా కంపెనీ( Sahiti Pharma Company )లో అగ్నిప్రమాదం సంభవించడం తెలిసిందే.

ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఐదుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు.

గాయాలైన వారికి కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే కంపెనీ గేటు ముందు కార్మికులు నిరసన( Workers Protest )కు దిగారు.

The Workers Protested In Front Of The Gate Of Atchutapuram SEZ Pharma Company, S

పరిశ్రమ యాజమాన్య వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తున్నారు.వరుస ప్రమాదాలను అరికట్టాలని.

ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో ఫార్మా కంపెనీలో మొత్తం 35 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

Advertisement

మంటలు చూచి 28 మంది కార్మికులు బయటకు వచ్చేసారని ఎస్పీ తెలియజేయడం జరిగింది.అచ్యుతాపురం సేజ్( Atchutapuram SEZ Pharma Company ) లోని ఫార్మా కంపెనీలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.

రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో తీవ్రభయాందోళనకు గురైన స్థానికులు అక్కడ నుంచి పరుగులు తీశారు.

మొత్తం ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు.ఇద్దరు మరణించడం జరిగింది.

గాయపడిన క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.కంపెనీ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రమాదం సంభవించినట్లు కార్మికులు కంపెనీ గేటు ముందు ఆందోళనకు దిగటం జరిగింది.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు