కరోనా సమయంలో విడుదలైన ఖైదీలకు ఊహించని షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!!

2019 నవంబర్ మాసంలో మహమ్మారి కరోనా( Corona ) చైనాలో బయటపడటం తెలిసిందే.అతి తక్కువ టైంలోనే ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం చుట్టేసింది.

వైరస్ వ్యాప్తి చెందకుండా తీవ్రత తగ్గించడానికి నానా తంటాలు పడ్డారు.ఈ ప్రమాదకరమైన వైరస్ కారణంగా చాలా దేశాలు ఆ సమయంలో లాక్ డౌన్ లు ప్రకటించడం జరిగింది.

వైరస్ తీవ్రతకు చాలామంది మరణించడం జరిగింది.ఈ వైరస్ అరికట్టడానికి మనదేశంలో కూడా ప్రభుత్వాలు అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవటం జరిగాయి.

లాక్ డౌన్ తో పాటు బయట జనాలు గుమ్మి కూడదని వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపించకుండా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.  కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో జైళ్ళలో రద్దీని తగ్గించేందుకు కొంతమంది ఖైదీలను విడుదల( Release the prisoners ) చేయడం జరిగింది.దీంతో తక్కువ తీవ్రతకు పాల్పడిన నేరాగాలతో పాటు విచారణ ఖైదీలను విడుదల చేయడం జరిగింది.

Advertisement

ఈ క్రమంలో కరోనా టైంలో విడుదలైన ఖైదీలు.తిరిగి జైలుకు రావాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది.15 రోజుల్లోగా సంబంధిత అధికారుల ముందు.ఖైదీలు లొంగిపోవాలని సూచించింది.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు