ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..!

ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

క్రమంలో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.కావాలంటే పీటీ వారెంట్ పై నిందితులను విచారించవచ్చని ఢిల్లీ పోలీసులకు(Delhi Police) హైకోర్టు సూచించింది.

అయితే రిజర్వేషన్ల (Reservations)రద్దు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన నేపథ్యంలో దానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే ఈ నూనె వాడాల్సిందే!

తాజా వార్తలు