TDP Robin Sharma : టీడీపీకి కలిసోస్తున్న రాబిన్ శర్మ వ్యూహాలు!

వైఎస్‌ఆర్‌సీపీ గడప గడపకు మన ప్రభుత్వంని ఎదుర్కోవడానికి టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది.

డిసెంబర్ 1న 45 రోజుల పాటు ప్రారంభించిన ఈ యాత్రకు ఏపీ పౌరుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుంటూరులోని పొన్నూరులో గురువారం భారీ నిరసన సభను ఏర్పాటు చేశారు.బాబు సభలో పాల్గొనేందుకు పొన్నూరుకు భారీగా జనం పోటెత్తారు.

టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో చంద్రబాబు భారీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సంఘటనకు సంబంధించిన కొన్ని చిత్రాలను పంచుకున్నారు.వైఎస్ జగన్ ప్రజలకు కేవలం రూ.10వేలు ఇచ్చి, రూ.10వేల కోట్లు దోచుకుంటున్నారని బాబు తన ప్రసంగంలో మండిపడ్డారు.“జగన్ సంక్షేమం తీసుకురాలేదు, రాష్ట్రానికి భారీ సంక్షోభం తెస్తున్నాడు” అని టీడీపీ అధ్యక్షుడు తెలిపారు.

ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే ప్రొగాన్ని టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ రూపకల్పన చేశారు.టీడీపీ బాదుడే బాదుడు నిరసన యాత్ర మంచి విజయం సాధించడం వెనుక ఆలోచన కూడా ఆయనేదని తెలుస్తుంది.

Advertisement

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహనం పెరుగుతోందని భావించిన భావించిన చంద్రబాబు ఎప్పుడు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నానికి రాబీన్ ఆలోచనలు కూడా తోడవుతుండడంతో టీడీపీ శ్రేణులు మంచి ఉత్సాహంగా ఉన్నారు.అయితే గతంలో టీడీపీకి  పరోక్షంగా సాయం చేసిన ఈనాడు ఇప్పుడు  నేరుగా చంద్రబాబు సపోర్ట్ చేస్తూ వార్తలు రాస్తుంది.వైసీపీ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తుంది.

ఇలా వార్తలు రాయడం వెనుక రాబిన్ శర్మ పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది.అలాగే ఇదే చివరి ఎన్నిక అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వెనుక కూడా రాబిన్ శర్మ ఇచ్చిన  ప్లాన్‌నేని తెలుస్తుంది.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు