కృష్ణ అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మామ మశ్చీంద్ర (Mama Mascheendra).
హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రలలో నటించారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్, మిర్చి కిరణ్, అజయ్, రాజీవ్ కనకాల, హరితేజ, షకలక శంకర్, అలీ రేజా తదితరులు ఈ సినిమాలో భాగమయ్యారు.ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.
పరశురామ్ (సుధీర్ బాబు) బాల్యంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా రాతి మనిషిలా మారడతాడు.వందల కోట్ల ఆస్తి కోసం సొంత మనుషులను సైతం చంపడానికి వెనుకాడడు.
చెల్లెలు తన భర్త పిల్లలని చంపమని తన మనుషులను పంపిస్తారు.ఇలా ఈ దాడి నుంచి వారు తప్పించుకుంటారు.
కొద్ది రోజుల తర్వాత పరశురామ్ కుమార్తె విశాలాక్షి (ఈషా రెబ్బా),( Eesha Rebba ) విశాఖలో రౌడీ దుర్గ (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు.ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన దాసు కుమార్తె మీనాక్షి (మృణాళిని రవి),( Mrinalini Ravi ) ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు.
ఈ విషయం తెలిసి.తన పోలికలతో జన్మించిన మేనల్లుళ్లు పగ తీర్చుకోవాలని అనుకుంటారు.
ఇక పరుశురాం మీద హత్యాయత్నం చేసినది ఎవరు? వీరిద్దరూ తమ కుమార్తెల వద్ద దాచిన నిజం ఏంటి అన్నదే ఈ సినిమా కథ.
ఇందులో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రలలో నటించారు అయితే ఈయనకు నార్మల్ క్యారెక్టర్ కాకుండా మిగతా రెండు క్యారెక్టర్లు ఏమాత్రం సెట్ కాలేదని చెప్పాలి.ఇక డబ్బింగ్ కూడా ఇతరులతో చెప్పించడం వల్ల ప్రేక్షకులు ఆ పాత్రను ఎంజాయ్ చేయలేకపోయారని చెప్పాలి. ఈషా రెబ్బా, మృణాళిని రవి. హీరోయిన్లు ఇద్దరి పాత్రలు రొటీన్! ఆయా పాత్రల్లో వాళ్ళ నటన కూడా! దర్శక, రచయితగా కంటే నటుడిగా హర్షవర్ధన్ బాగా నటించారు ఇక రాజీవ్ కనకాల,( Rajiv Kanakala ) షకలక శంకర్,( Shakalaka Shankar ) అలీ రేజా ( Ali Reza ) వంటి వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్టర్ హర్షవర్ధన్( Harshavardhan ) సుదీర్ బాబుని ఏకంగా మూడు పాత్రలలో చూపించేసరికి ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇక మ్యూజిక్( Music ) కూడా ఈ సినిమాకు పెద్దగా లేదని చెప్పాలి, ఇక సుధీర్ బాబుకు మేకప్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి.
రచయితగా హర్షవర్ధన్ ఎన్నో అద్భుతమైన సినిమాలకు కథ రాశారు కానీ దర్శకుడుగా మెప్పించలేకపోయారు.అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కన్ఫ్యూజన్ కి గురయ్యారు.
ఇక ఈ సినిమా చూడగానే మొదట్లోనే అలా వైకుంఠపురం సినిమా గుర్తుకు వస్తుంది.కొన్నిచోట్ల ట్విస్టులను సాగదీస్తూ వచ్చారు.
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.హీరోయిన్స్ నటన పరవాలేదు అనిపించింది.
సుధీర్ బాబు మూడు పాత్రలలో నటించడం, కథ గందరగోళం, మ్యూజిక్.
కథలో కంటెంట్ లేకపోయినా ఏదో సినిమాని సాగదీస్తూ వచ్చారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారని చెప్పాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy