రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) కాపు సామాజిక వర్గం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి.
కాపుల్లో ఐక్యత లేదని, అదే ఉండి ఉంటే గత ఎన్నికల్లో తాను ఓడిపోయే పరిస్థితి ఉండేది కాదని పవన్ అన్నారు.
గత ఎన్నికల్లో కాపుల జనాభా ఎక్కువగా ఉన్న భీమవరం, గాజువాక నియోజకవర్గం ఎంచుకుని మరి పోటీకి దిగినా, తాను ఓడిపోవడం వెనక కాపుల్లో ఐక్యత లోపించడమే కారణమని పవన్ అన్నారు.జనసేన, టిడిపి , వైసిపి లుగా కాపు సామాజిక వర్గం నేతలు చీలిపోవడం వల్లే జనసేనకు ఆదరణ లభించడం లేదనే విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పారు.
కాపులంతా ఐక్యంగా జనసేనకు మద్దతుగా నిలబడకుండా పార్టీల వారీగా విడిపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని పవన్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు.అంతేకాదు ఎక్కడైనా, ఎప్పుడైనా కాపులంతా ఐక్యంగా తను వెంట నడవాలని విషయాన్ని పవన్ గుర్తు చేశారు.
జనసేనను (Janasena party) 20 సీట్లకి పరిమితం చేసామన్న వాదనను నమ్మవద్దని పవన్ కోరారు.లోపాయకారి ఒప్పందాలు పెట్టుకోనని, పార్టీని నమ్ముకున్న వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించనని, ఒకరితో అవమాన పడి ఎందుకు ఉంటాను అంటూ ప్రశ్నించారు.ఎవరి అజెండాల కోసం జనసేన పనిచేయదని , పరోక్షంగా టిడిపి అంశాన్ని ప్రస్తావించారు.
అయితే పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వలన కారణాలు చాలా కనిపిస్తున్నాయి.ఇతర పార్టీల్లోని కాపు సామాజిక వర్గం నేతలు తనపై ఇప్పటివరకు చేస్తున్న ఎదురు దాడిని తగ్గించేందుకు, అలాగే జనసేన లోకి వారిని రప్పించే వ్యూహం కనిపిస్తోంది.ఈరోజు బందర్ లో జరగబోయే బహిరంగ సభలోనూ కాపు సామాజిక వర్గం కు(Kapu social category) సంబంధించి పవన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకుల అంచన.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy