ఆ హీరోయిన్ ను అక్కినేని అఖిల్ అమ్మ అని పిలుస్తాడట..?

అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్ చిన్న వయస్సులోనే సిసింద్రీ అనే సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అఖిల్ తల్లిదండ్రులుగా ఆమని, శరత్ బాబు నటించారు.

నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా టబు, పూజా బాత్ర గెస్ట్ రోల్స్ చేశారు.శివ నాగేశ్వరరావు ఈ సినిమాకు దర్శకుడు కాగా 1995 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైంది.

అయితే ఈ సినిమాలో అమ్మ పాత్రలో నటించిన ఆమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అక్కినేని కుటుంబంలో ఆమని నాగేశ్వరరావు, నాగార్జున, అఖిల్ సినిమాల్లో కూడా నటించారు.

అఖిల్ తో బంధం గురించి మాట్లాడిన ఆమని అఖిల్ ఇప్పటికీ తనను అమ్మ అని పిలుస్తాడని తెలిపారు.ఎక్కడ కనబడినా అమ్మ అంటూ తన దగ్గరకు వస్తాడని వెల్లడించారు.

Advertisement

సిసింద్రీ సినిమాలో నటించడం మరిచిపోలేని అనుభూతి అని ఆమె అన్నారు.ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా అఖిల్ కు అమ్మగా ఆమని నటిస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు హీరోగా సరైన సక్సెస్ లేని అఖిల్ పూజా హెగ్డేతో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానుందని తెలుస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈ సినిమాతో పాటు అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు