శ్రీముఖిని ఆ జంతువుతో పోల్చిన కమెడియన్.. పరువు పోవడంతో..?

కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ షో సీజన్ 3లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని ఆ షో తరువాత కొన్ని నెలల పాటు షూటింగ్ లకు దూరమయ్యారు శ్రీముఖి.

తెలుగులో పదుల సంఖ్యలో షోలు, ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి రవితో కలిసి చేసిన పటాస్ షో ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అయితే బిగ్ బాస్ షోలో ఛాన్స్ రావడంతో పటాస్ షోకు దూరమైన శ్రీముఖి బిగ్ బాస్ షో తర్వాత కొన్ని నెలలు షూటింగ్ లకు దూరంగా ఉన్నారు.అయితే గత కొన్ని నెలల నుంచి శ్రీముఖి మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.

ఈటీవీ, జీ తెలుగు నిర్వహించే ఈవెంట్లలో శ్రీముఖి సందడి చేస్తున్నారు.బొమ్మ అదిరింది అనే షోకు కూడా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించగా ఆ షో ఫ్లాప్ షో నిలవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది.

అయితే శ్రీముఖికి ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.మరోవైపు సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి యాక్టివ్ గా ఉంటున్నారు.

Advertisement

సినిమాల్లో కూడా నటించిన శ్రీముఖి నటిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా త్వరలో విడుదల కానుంది.శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్ని నెలల క్రితం వైరల్ అయినా ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పెళ్లికి సంబంధించి శ్రీముఖి స్పష్టతనిచ్చింది.

ఇకపోతే జీ తెలుగు ఛానల్ జీ తెలుగు వారి పాట సరదా సయ్యాట పేరుతో రేపు సాయంత్రం ఒక ఈవెంట్ ను ప్రసారం చేస్తోంది.యాంకర్ శ్రీముఖి ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించారు.

బుల్లితెర కమెడియన్లలో ఒకరైన సద్దాం స్టేజ్ పైకి వచ్చిన తరువాత ఒక వ్యక్తి వచ్చి సద్దాం కాళ్లపై పడతాడు.ఆ తరువాత ఫ్యాన్ తో సద్దాం మీ ఇంటికి వస్తానని గొర్రెతో తనకు దావత్ ఇవ్వాలని వెనుక బర్రె ఉంది సక్కాగా పొమ్మని శ్రీముఖిని బర్రెతో పోలుస్తాడు.

సద్దాం అలా బర్రెతో పోల్చడంతో శ్రీముఖి విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు