సాయి పల్లవికి అరుదైన సర్టిఫికెట్.. ఎవరూ అందుకోలేని ప్రశంస..?

తమిళ సినీ దర్శకుడు మణిరత్నం ( Mani Ratnam )తీసే ప్రతి సినిమానీ తెలుగులోకి డబ్ చేస్తారు.అవి సూపర్‌హిట్ అవుతుంటాయి.

అలా వచ్చిన సినిమాల్లో నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి వంటి క్లాసిక్ సినిమాలు తెలుగు వారికి ఎంతో నచ్చాయి.మణిరత్నం ఎంత గొప్ప దర్శకుడో కూడా ఈ సినిమాలతో అర్థమయింది.

ఈ డైరెక్టర్ పెద్దగా మాట్లాడడు కానీ ఆయన సినిమాలు మాత్రం భారతదేశ వ్యాప్తంగా పెద్ద రచ్చ క్రియేట్ చేస్తాయి.మణిరత్నం కమల్ హాసన్, ఐశ్వర్య రాయ్ లాంటి ఎంతో టాలెంట్‌ ఉన్న యాక్టర్లను చూశాడు.

అలాంటి యాక్టర్లలోని 100% టాలెంట్‌ను ఉపయోగించుకుంటూ వారి ఇమేజ్‌ను పెంచాడు.దర్శకత్వంలో ఎంతో ప్రతిభ ఉన్నా సరే మణిరత్నం ప్రశంసల కోసం పాకులాడాడు.

Advertisement

అంతేకాదు ఎవరినీ ప్రశంసించడు, అభినందించడు కూడా.

అలాంటి మణిరత్నం తాజాగా తాను సాయి పల్లవి( Sai Pallavi)కి ఓ పెద్ద అభిమానిని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఇప్పటిదాకా మణిరత్నం సినిమాలో నటించలేదు.ఫిదా, శ్యామ్ సింగ రాయ్‌, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి తెలుగు సినిమాలతోనే ఈ తార బాగా పేరు తెచ్చుకుంది.

తమిళంలో నటించింది కానీ అగ్ర హీరోయిన్ కాలేకపోయింది."రౌడీ బేబీ" అనే ఒక తమిళ పాట తప్ప సాయి పల్లవి అక్కడ పెద్దగా చెప్పుకోదగిన మంచి పాత్ర ఏమీ చేయలేదు.

కానీ మణిరత్నం మాత్రం సాయి పల్లవికి తాను బిగ్ ఫ్యాన్‌ అని అన్నాడు.

నిఖిల్ డేంజర్ గాడు తీసేయాలే.. వైరల్ అవుతున్న గంగవ్వ సంచలన వ్యాఖ్యలు!
82 సంవత్సరాల వయస్సులో సైతం వ్యాయామాలతో షాకిస్తున్న సుమ తల్లి.. ఏమైందంటే?

ఆయన ఏ సినిమాలో సాయి పల్లవి ప్రతిభను చూసి అభిమాని అయ్యాడు? అనేది ప్రస్తుతానికి తెలియ రాలేదు."సాయి పల్లవితో కలిసి ఒక సినిమా చేయాలని ఆశిస్తున్నాను, కుదిరితే కచ్చితంగా ఆమెతో సినిమా చేస్తాను" అని కూడా మణిరత్నం అన్నాడు.మణిరత్నం సినిమాలో ఒక భాగం కావడానికి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి.

Advertisement

ఆయన సినిమాల్లో ఒక మంచి పాత్ర కోసం పాకులాడే నటీమణులు ఎందరో.అలాంటి గొప్ప డైరెక్టర్ సాయి పల్లవితో సినిమా చేయాలనేదే తన ఆశయం అన్నట్లు మాట్లాడటం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

మణిరత్నం నుంచి వచ్చిన ఈ మాటలు సాయి పల్లవికి దక్కిన ఒక అరుదైన ప్రశంస, సర్టిఫికేట్ అని చాలామంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇంతకీ మణిరత్నం ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంగా చేశాడంటే, తమిళంలో శివకార్తికేయన్ హీరోగా "అమరన్" మూవీ రూపొందుతోంది.

జమ్ము కశ్మీర్‌లో ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాద నేతల్ని చంపేసిన మేజర్ ముకుంద్ వరదరాజన్( Mukund Varadarajan ) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వస్తోంది.మరణాంతరం వరదరాజన్‌కు అశోక చక్ర ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం.

ఆ ముకుంద్ సతీమణి పేరు ఇందు రెబెకా వర్ఘీస్.ఆమె పాత్రలోనే సాయిపల్లవి కనిపించనుంది.

ఇటీవల ఈ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌ జరిగింది.దానికి ముఖ్యఅతిథిగా వచ్చిన మణిరత్నం సాయిపల్లవిపై ఎవరు ఊహించని విధంగా ప్రశంసల వర్షం కురిపించారు.

మామూలుగా మణిరత్నం సినిమా ఈవెంట్లకు వెళ్లడు కానీ సాయి పల్లవి సినిమా కాబట్టే అతను ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినట్లుగా తెలుస్తోంది.ప్రేమమ్ సినిమా చూశాక తాను కూడా ఆమె ఫ్యాన్ అయిపోయానని శివ కార్తికేయన్ పొగిడాడు.

అలా ఆమెకు ఆ వేదికపై ఏ హీరోయిన్ అందుకోలేని ప్రశంసలను అందుకుంది సాయి పల్లవి.

తాజా వార్తలు