కేజిఎఫ్ 2 టీమ్ గురించి అలా మాట్లాడిన రజినీకాంత్.. ఏం మాట్లాడారంటే?

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ 2 .

ప్రస్తుతం ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంది.

ఎవరూ ఊహించని రీతిలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.కేజిఎఫ్ సినిమా కు సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా ప్రస్తుతం దేశమంతటా కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.

హీరో ఎస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు దేశమంతటా మార్మోగి పోతున్నాయి.దర్శక ధీరుడు రాజమౌళి స్థాయిలో ప్రశాంత్ నీల్ ఈ కేజిఎఫ్ 2 చిత్రాన్ని రూపొందించారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రాజమౌళి, ప్రశాంతి నీల్ తమ సినిమాలతో మన భారతీయ చలనచిత్ర స్థాయిని అమాంతం పెంచేశారు.ప్రస్తుతం కేజిఎఫ్2 సినిమా విడుదలై ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంశలను సొంతం చేసుకుంది.

Advertisement

ఇదిలా ఉండగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కేజిఎఫ్2 సినిమా మీద ప్రశంసలు కురిపించాడు.రజినీకాంత్ కేజిఎఫ్ 2 సినిమా చూసిన తర్వాత స్వయంగా నిర్మాతకు ఫోన్ చేసి సినిమా బాగా తీశారు అంటూ ప్రశంసించాడు.

ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకోవడంతో వారి ఆనందం మాటల్లో చెప్పలేక పోతున్నారు.

రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ మరియు అరుణ్ రాజ్ కామరాజు దర్శకత్వంలో రెండు సినిమాలు చేయబోతున్నాడు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు మొదలు కానున్నట్టు సమాచారం.తమిళ ఇండస్ట్రీలో కేజిఎఫ్ 2 సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

దీంతో ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేందుకు ఈ సినిమా కోసం థియేటర్లు పెంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?
Advertisement

తాజా వార్తలు