బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగానే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసింది..

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నీ బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అనర్హత ప్రకటించిన నేపథ్యంలో ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ కె గౌస్, బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి ఆధ్వర్యంలో బోయినిపల్లి మండల కేంద్రం లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్బంగా షేక్ గౌస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎంపీ అనర్హత వేటు పై బిజెపి అవలంబిస్తున్న నిరంకుశ పాలన తీరును మండల ప్రజలకు వివరించారు.

దేశంలో ఆర్థిక నేరస్తులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారు.వారిపై చర్యలు తీసుకోకుండా ఇదేంటి అని ప్రశ్నించిన రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అణచివేయాలనే ధోరణి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందనీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, తడగొండ ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, ఎండీ బాబు, పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, దూస జనార్దన్, మండల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి, జాగిరి వెంకటేష్, నక్క శ్రీకాంత్, దిలీప్ రెడ్డి, మహేష్, వంశీ, తోట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

Latest Suryapet News