మహేష్,పవన్ నిర్మాతకి జైలు శిక్ష

శింగనమల రమేష్ .ఒకేసారి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలను నిర్మించి అప్పట్లో సంచలనం సృష్టించారు.

ఖలేజా, కొమరం పులి .ఈ రెండు చిత్రాల్లో ఏ ఒక్క చిత్రం సక్సెస్ ని సాధించినా రమేష్ దశ తిరిగేదే.కాని ఆ ఇద్దరు స్టార్ల మీద గుడ్డి నమ్మకంతో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయాడు ఈ నిర్మాత.

ఇటు పులి, అటు ఖలేజా .రెండూ భారి డిజాస్టర్లే.ఆ దెబ్బతో పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు రమేష్.

ఆ చిత్రాల తరువాత మళ్ళీ సినిమాలు నిర్మించలేదు.అర్థిక ఇబ్బందుల్లో ఉన్న రమేష్, కర్నూలుకి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొంతకాలం క్రితం, 15 లక్షల అప్పు తీసుకున్నారట.

Advertisement

బకాయి చాలాకాలం వాయిదా వేసిన రమేష్ చివరికి పదిహేను లక్షల చెక్ ఒకటి రాజశేఖర్ రెడ్డికి అందజేశారు.అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యింది.

దీంతో బాధితుడు కర్నూలు జిల్లా కోర్టుని ఆశ్రయించాడు.విచారణ అనంతరం ఒక ఏడాది జైలు శిక్ష సింగనమల రమేష్ కు విధించింది కోర్టు.

Advertisement

తాజా వార్తలు