బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమం ప్రస్తుతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఈరోజు పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేసిన హంగామా కారణంగా ప్రస్తుతం ప్రశాంత్ జైలులో ఉన్నారు.
ఆయన అభిమానులు అతి ఉత్సాహం కనబరుస్తూ అమర్ ( Amar ) , ఇతరుల కంటెస్టెంట్ల కార్లపై రాళ్లు విసరడం అలాగే ప్రభుత్వ బస్సులపై రాళ్లు విశ్రమతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ప్రియాంక జైన్ ఈ సందర్భంగా అమర్ కారు పై జరిగినటువంటి దాడి గురించి మాట్లాడారు.
ఫాన్స్ పేరిట ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించడంలో తప్పు లేదని తెలిపారు.ఎంతో కష్టపడి కొనుక్కున్న వస్తువులను ఇలా ఒక్క నిమిషంలో నాశనం చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు.దాడి చేసే సమయంలో ఆ కారులో మహిళలు ఉన్నారు అన్న ఆలోచన కూడా లేకుండా విచక్షణ రహితంగా రాళ్లతో దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ ఈమె తెలిపారు.
మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతవరకు మాత్రమే గొడవ పడతాము.ఒక టాస్క్ పూర్తికాగానే అందరం కలిసిపోయి మాట్లాడే వాళ్ళమని తెలిపారు.
ప్రశాంత్ యావర్,అమర్, నేను అందరం సరదాగా మాట్లాడుకునే వాళ్ళమని చివరి 4 వారాలలో మా అందరి మధ్య బాండింగ్ మరింత ఎక్కువైందని ప్రియాంక ( Priyanka Jain )తెలిపారు.ప్రశాంత్ నిజంగానే భూమి బిడ్డ అంటూ ఈ సందర్భంగా ఈమె మాట్లాడారు అయితే ప్రియాంక ఈ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సమయానికి పల్లవి ప్రశాంత్ ఇంకా అరెస్టు కాలేదు అందుకే ఈమెకు పల్లవి ప్రశాంత్ అరెస్టు విషయం గురించి ప్రశ్నలు ఎదురు కాలేదు అలాగే ఈమె ఈ అరెస్టు విషయంపై స్పందించను లేదు..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy