ఒక్క సినిమాతోనే పత్తా లేకుండా పోయిన ఈ హీరోయిన్ మీకు గుర్తుందా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు "దేవ కట్టా" దర్శకత్వం వహించిన "ప్రస్థానం" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ "రూబీ పరిహార్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే వచ్చీ రావడంతోనే ఈ అమ్మడు శర్వానంద్ వంటి స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

దీనికితోడు తెలుగులో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాల కథల విషయంలో అవగాహన లోపించడంతో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.ఇక మరిన్ని చిత్రాలయితే ఏకంగా విడుదలైనట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు.

దీంతో కొంత కాలం పాటు ఈ అమ్మడు హీరోయిన్ గా తన ఉనికిని చాటుకునేందుకు సినిమా పరిశ్రమలో బాగానే కష్ట పడింది. అయినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం వరించ లేదు.

దీంతో ఇక చేసేదేమీ లేక మూటాముల్లె సర్దుకుని ముంబైకి వెళ్ళిపోయింది. అయితే బాలీవుడ్ లో తెలిసిన వారి ద్వారా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన "గబ్బర్ ఈస్ బ్యాక్" అనే చిత్రంలో ఓ చిన్న పాత్ర లో కనిపించింది.

Advertisement

కానీ ఈ చిత్రం కూడా ఈ అమ్మడికి అవకాశాలను తెచ్చి పెట్టలేకపోయింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు మోడలింగ్ రంగంలో పని చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇటీవలే రూబీ పరిహార్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడిందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.కానీ రూబీ పరిహార్ మాత్రం తన పెళ్లిపై వినిపిస్తున్న వార్తల గురించి మాత్రం స్పందించలేదు.

ఈ విషయం ఇలా ఉండగా రూబీ పరిహార్ తెలుగు, కన్నడ, హిందీ, తదితర భాషలలో దాదాపుగా ఎనిమిది కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇందులో ప్రస్థానం, గబ్బర్ ఈస్ బ్యాక్ తదితర చిత్రాలు తప్ప మిగిలిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో రూబీ పరిహార్ సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం రూబీ ముంబై లో నివాసముంటున్న ట్లు సమాచారం.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు