జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) రెండో దశ ప్రారంభించబోతున్నట్లు పార్టీ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఈనెల 9న ఏలూరు నియోజకవర్గం( Eluru Constituency ) నుండి ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
"గత నెల 14న అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి విజయ యాత్ర రెండో దశ ఏలూరు నుంచి ప్రారంభించడానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు.ఆయన ఈ రోజు సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) గారితో సుదీర్ఘంగా చర్చించారు.9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభం అవుతుంది.
ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలసి స్థానిక రాజకీయ పరిస్థితులపై మాట్లాడతారు" అనీ ప్రకటన విడుదల చేయడం జరిగింది.మొదటి దశ వారాహి విజయ యాత్రలో నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో సాగింది.ఉభయ గోదావరి జిల్లాలలో.
ఈ యాత్ర విజయవంతం కావటానికి జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఈ క్రమంలో జులై 9వ తారీకు ఏలూరు నియోజకవర్గం నుండి రెండో దశ వారాహి విజయ యాత్ర ప్రారంభం కాబోతున్నట్లు పార్టీ ప్రకటన విడుదల చేయటంతో జనసేన ( Janasena ) శ్రేణులలో ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy