భార్య కోసం సీటు ఇవ్వమని అడిగిన యువకుడిపై దాడి,మృతి

రైలు లో ఒక చిన్న సీటు విషయంలో జరిగిన వాగ్వివాదం ఒక యువకుడి ప్రాణాల పోయే పరిస్థితి చోటుచేసుకుంది.

ముంబై-లాతూర్-బీదర్ ఎక్స్ ప్రెస్ రైలు లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

రైలులో తన భార్య కూర్చునేందుకు సీటు అడిగినందుకు ఓ యువకుడిని ఆరుగురు మహిళలు సహా మొత్తం 12 మంది కలిసి చితకబాదడం తో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.వివరాల్లోకి వెళితే.

ముంబైలోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన సాగర్ మర్కంద్ తన భార్య, రెండేళ్ల చిన్నారితో కలిసి కళ్యాణ్‌లో బీదర్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు.జనరల్ బోగీ కావడం.

రద్దీ ఎక్కువగా ఉండడంతో తన భార్య కూర్చోవడం కోసం సీటు సర్దుకోవాలని ఓ సీటులో కూర్చున్న మహిళను కోరాడు.అయితే దానికి సదరు మహిళ నిరాకరించక పోగా అతడితో వాగ్వాదానికి దిగింది.

Advertisement

అది కాస్త వివాదంగా మారడం తో వారి మధ్య ఘర్షణ నెలకొంది.అయితే ఈ ఘర్షణలో ఆ మహిళతో పాటు మరో 11 మంది కలిసి ఆ యువకుడి పై దాడికి దిగడం తో బాధితుడి భార్య కొట్టొద్దని ఎంతగా వారించినప్పటికీ వినకుండా గంటపాటు అతడిని విపరీతంగా కొట్టారు.

పూణే నుంచి దౌండ్ స్టేషన్ వరకు బాధితుడిపై వారు తమ దాడిని ఆపలేదు.దౌండ్ స్టేషన్‌లో రైల్వే పోలీసులు సాగర్‌ను ఆస్పత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు