ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..: మంత్రి కాకాణి

మిచాంగ్ తుపాను ప్రభావంపై అధికారులతో మంత్రి కాకాణి గోవర్థన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అయితే రేపు కావలి - బాపట్ల మధ్య తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి కాకాణి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే వర్షం ప్రభావంతో ఇప్పటికే కూలిన విద్యుత్ పోల్స్, చెట్లను తొలగించాలని సూచించారు.మంత్రి కాకాణి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖాధికారులను అలర్ట్ చేశారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు