ఎన్టీఆర్‌, తమన్నాలు ఒకేసారి ఎంట్రీ ఇవ్వనున్నారా?

టీవీ టీఆర్పీ రేటింగ్‌ విషయంలో జెమిని టీవీ వెనుక పడింది అనడంలో సందేహం లేదు.

స్టార్‌ మా, జీ తెలుగు, ఈటీవీల తర్వాత మాత్రమే జెమిని టీవీ రేంటింగ్‌ ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

అందుకే జెమిని టీవీ కాస్త ఎక్కువ ఖర్చు అయినా కూడా పర్వాలేదు అన్నట్లుగా భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్దం అయ్యింది.ముందుగా ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ను తీసుకు రాబోతున్నారు.

ఇప్పటికే షో కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఏ క్షణంలో అయినా టెలికాస్ట్‌ అవ్వచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక తమన్నా హోస్ట్‌ గా మాస్టర్‌ చెఫ్‌ ను కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జెమిని టీవీ సిద్దం అయ్యింది.ఈ రెండు షో లను ఆగస్టులోనే టెలికాస్ట్‌ చేయడం ద్వారా ఒకేసారి ఛానెల్‌ రేటింగ్ ను అమాంతం పెంచడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు మొదటి గెస్ట్ గా రామ్‌ చరణ్‌ రాబోతున్నాడు అని జక్కన్న కూడా వస్తాడనే నమ్మకంతో ఉన్నారు.ఇక గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు షో ను చేసిన నాగ్‌ మరియు చిరంజీవిలను కూడా ఈ షో కోసం గెస్ట్‌ లు గా తీసుకు వస్తారని అంటున్నారు.

మొత్తానికి టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకోవడం కోసం

జెమిని వారు చేయబోతున్న

ప్రయత్నాలు ఇతర ఛానెల్స్ కు కాస్త టెన్షన్‌ పెడుతున్నాయట.ఒక వైపు బిగ్‌ బాస్ మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరులు ఇంకో వైపు తమన్నా మాస్టర్ చెఫ్ షో లు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు మస్త్‌ ఎంటర్‌ టైన్ మెంట్‌ ను అందించబోతున్నాయి.జెమిని టీవీ ఈ దెబ్బతో మంచి రేటింగ్‌ ను దక్కించుకుంటుంది అనే నమ్మకంను బుల్లి తెర వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు