1000 మందితో క్లైమాక్స్ సీన్.. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయనుందా?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram) గురించి మనందరికీ తెలిసిందే.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తూ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఎప్పుడు అలరిస్తూ ఉంటారు కళ్యాణ్ రామ్.ఇకపోతే గత ఏడాది డెవిల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు.

అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి( Pradeep Chilukuri ) దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.తాజాగా కూడా ఈ సినిమాకి సంబంధించిన ఓకే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.అదేమిటంటే.NKR 21 క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేశారట.హైదరాబాద్ సమీపంలో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి( Art Director Brahma Kadali ) నేతృత్వంలో వేసిన భారీ సెట్ లో ఏకంగా 30 రోజుల పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

రామకృష్ణ అదిరిపోయే యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఈ ఎపిసోడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ లతో కలిపి దాదాపు 1000 మంది పాల్గొన్నారట.

కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో అత్యంత భారీగా రూపొందించిన క్లైమాక్స్ ఇదే అని తెలుస్తోంది.మరి ఇంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.తాజాగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ అప్డేట్ తో ఆ అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటాడో చూడలే మరి.ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నందమూరి అభిమానులు చెబుతున్నారు.

జగన్ చేస్తున్న డిమాండ్ అమలు సాధ్యమేనా ? 
Advertisement

తాజా వార్తలు