Himachal Pradesh : హిమాచల్‎ప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మలుపులు..!!

హిమాచల్‎ప్రదేశ్ లో( Himachal Pradesh ) రాజకీయ వేడి కొనసాగుతోంది.

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో( Rajyasabha Elections ) క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది.

రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు.రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు ఓటు వేయడంతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్( BJP Harsh Mahajan ) హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు.మరోవైపు తన నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సుఖు( CM Sukhu ) కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?
Advertisement

తాజా వార్తలు