వీఆర్ఏల‌తో మంత్రి కేటీఆర్ చ‌ర్చ‌లు

వీఆర్ఏల‌తో మంత్రి కేటీఆర్ చ‌ర్చలు జ‌రిపారు.స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం గ‌త కొన్ని రోజులుగా నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌లు కొన‌సాగిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈరోజు అసెంబ్లీ ముట్ట‌డికి ప్ర‌య‌త్నించగా.పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నేప‌థ్యంలో వీఆర్ఏల‌ను చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.ఉద్యోగాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, వేత‌నాల పెంపు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వీఆర్ఏల స‌మ‌స్య‌ల‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement

అంతేకాకుండా ఈ నెల 20న మ‌రోసారి స‌మ‌గ్రంగా చ‌ర్చిస్తామ‌ని చెప్పారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్10, మంగళవారం 2024
Advertisement

తాజా వార్తలు